
యెహోవా కొరకు [ఆశించేవారు, వెదకే వారు మరియు ఆయన కొరకు వేచి యుండేవారు] ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు. (యెషయా 40:31)
మనము సమయంతో ముడిపడియున్న ప్రపంచంలో జీవిస్తున్నాము మరియు మనం చేసే ప్రతి పని అత్యవసరమైనదిగా అనిపిస్తుంది. మనల్ని చాలా భయంకరంగా బిజీగా ఉంచడం ద్వారా ప్రజలను ప్రార్థన చేయకుండా మరియు వాక్యంలో గడపకుండా ఉండటానికి శత్రువు తన పథకంలో చాలా విజయవంతమయ్యాడు. మనము నమ్మశక్యం కాని ఒత్తిడిలో జీవిస్తున్నాము మరియు మనం ఒక విషయం నుండి మరొక విషయమునకు పరిగెత్తుతాము – జీవితంలో నిజంగా ముఖ్యమైన విషయాలను మనం తరచుగా నిర్లక్ష్యం చేసే స్థాయికి: అనగా దేవుడు, కుటుంబం మరియు ఇతర సంబంధాలు, మన ఆరోగ్యం మరియు మన ఆధ్యాత్మిక జీవితాలను నిర్మించుట. అప్పుడు మనం మరింత ఒత్తిడికి లోనవుతాము-మరియు దానిని ఎదుర్కోవటానికి మరియు జీవితాన్ని తిరిగి పొందటానికి ఏకైక మార్గం దేవునితో చేరడం మరియు ఆయన మనకు చెప్పేది వినడం. ఇది సత్యం; మనం నిజంగా ఆయనను విడిచి జీవితాన్ని నిర్వహించలేము. ఆయన లేకుండా మనం ఒత్తిడి, గందరగోళం మరియు కలవరమును నిర్వహించలేము. మనం వాక్యంలో మరియు ప్రార్థనలో సమయం గడపకపోతే – మన వివాహ జీవితం దెబ్బతింటుంది, మన పిల్లలు బాధపడతారు, మన ఆర్థిక పరిస్థితులు గందరగోళంలో పడతాయి, మన సంబంధాలు వృద్ధి చెందవు. మనం కేవలం రోజును గడపడానికి ప్రయత్నించే బదులు విషయాల గురించి ప్రార్థించడం ప్రారంభించినట్లయితే దేవుడు మనల్ని బలపరుస్తాడు మరియు జీవితాన్ని శాంతియుతంగా మరియు తెలివిగా నిర్వహించేలా చేస్తాడు. మనం దేవునితో సమయాన్ని వెచ్చించి, ఆయన స్వరాన్ని విన్నప్పుడు, ఆయన మన బలాన్ని పునరుద్ధరిస్తాడు మరియు మనం అలసిపోకుండా జీవితాన్ని నిర్వహించేలా చేస్తాడు. అయితే దేవునికి ఎల్లప్పుడూ మొదటి స్థానం ఇస్తూ మనకున్న సమయాన్ని తెలివిగా ఉపయోగించడం ద్వారా మనం ప్రారంభించాలి.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: ప్రతిరోజూ దేవుని స్వరము వినుటకు సమయం తీసుకోండి.