
ఎవడును తరుమకుండనే దుష్టుడు పారిపోవును నీతిమంతులు సింహమువలె ధైర్యముగా నుందురు. (సామెతలు 28:1)
ప్రజలు ప్రార్థించకపోవడానికి ఒక ప్రధాన కారణం మరియు వారు తమకు అవసరమైన మరియు కోరుకున్న వాటి కోసం దేవున్ని అడగడానికి ఇష్టపడరు. వారు తమ గురించి మంచిగా భావించరు; వారు తగినంత ఆధ్యాత్మికంగా ఉన్నారని వారు భావించరు, కాబట్టి దేవుడు తమ మాట వింటాడని వారు నమ్మరు. మనమందరం తప్పులు చేస్తాం మరియు మనం చేసినప్పుడు మనం దేవుని క్షమాపణ మరియు దయను పొందాలి, ఇది మనం తప్పులు చేసినప్పటికీ ఆయన ఆశీర్వాదాలను ప్రవహింపజేస్తుంది.
మనం దేవునితో మాట్లాడినప్పుడు మరియు ఆయనకు మొర్ర పెట్టినప్పుడు, యేసు రక్తం ద్వారా నీతిమంతులుగా చేయబడిన దేవుని కుమారులు మరియు కుమార్తెలుగా మన స్థానాన్ని అర్థం చేసుకోవాలి. లేకపోతే, మనం ఆయన స్వరాన్ని స్పష్టంగా వినలేకపోవచ్చు లేదా ఆయన సమాధానాలను సరిగ్గా గ్రహించలేము. మనం చాలా తరచుగా మన నీతి అనేది “యధార్ధమైన” పనులు చేయడంపై ఆధారపడి ఉంటుందని అనుకుంటాము- “యధార్ధమైన” మాటలు చెప్పడం, “యధార్ధమైన” మార్గాల్లో ప్రవర్తించడం లేదా “సరైన” వైఖరిని కలిగి ఉండటమని మనము అనుకుంటాము. నిజమేమిటంటే, మనల్ని మనం నీతిమంతులుగా చేసుకోలేము. మనల్ని మనం మతపరమైన వారముగా చేసుకోగలము, కానీ మనల్ని మనం నీతిమంతులుగా చేసుకోలేము. నిజమైన బైబిల్ నీతి మనం చేసే పనిపై ఆధారపడి ఉండదు, కానీ అది యేసు మన కోసం చేసినదానిపై ఆధారపడి ఉంటుంది. విశ్వాసం ద్వారా ఆయన నీతి మనది అవుతుంది మరియు ఒకసారి మనం దానిని విశ్వసిస్తే, మనం క్రమంగా మరింత సరైన ప్రవర్తనను ప్రదర్శిస్తాము. కానీ, దేవుడు మన ప్రార్థనలకు సమాధానమిస్తాడని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఆయన మంచివాడు, మనం మంచి వారమైనందున కాదు. ప్రార్థనలో మనం ధైర్యంగా ఆయనను సంప్రదించవచ్చు మరియు ప్రతిరోజూ ఆయన నుండి వినాలని ఆశించవచ్చు.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీరు దేవుని యందు నమ్మిక యుంచి ధైర్యముగా ప్రార్ధించినట్లైతే, దేవుడు మీ పొరపాటులను అద్భుతాలుగా మారుస్తాడు.